కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ.. పీసీసీ చీఫ్ రాజీనామా

కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ.. పీసీసీ చీఫ్ రాజీనామా

జార్ఘండ్ లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ పీసీీసీ  చీఫ్ అజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీలో అవినీతి పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. కొందరు నేతలు పార్టీ నేతలు సంపాదనే ధ్యేయంగా టికెట్లు అమ్ముకుంటున్నారని.. తాను చూస్తూ భరించలేకపోతున్నానని. అందుకే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తెలిపారు. కొందరు పార్టీ కోసం కాకుండా తమ సొంత ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ నేతల కన్న క్రిమినల్స్ బెటర్ అని అన్నారు అజయ్.