కడెం మండలం ఎలగడపలో మొసలి కలకలం

కడెం మండలం ఎలగడపలో మొసలి కలకలం

నిర్మల్ జిల్లా: కడెం మండలం ఎలగడప గ్రామంలో మొసలి కలకలం సృష్టించింది. మొసలిని చూసి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు మొసలిని పట్టి బంధించి కడెం ప్రాజెక్టులో వదిలారు. సమీపంలో ఉన్న గోదావరి నదిలో మొసలి కొట్టుకుని వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు.

దారి తప్పి ఊర్లోకి వచ్చిన మొసలిని గ్రామస్తులు వెంటనే చూసి అటవీశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. అటవీ శాఖ సిబ్బంది వచ్చి మొసలిని పట్టుకొని కడెం ప్రాజెక్టులో వదిలి వేయడంతో ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు.