వరంగల్‌లో మల్టీ సూపర్‌‌‌‌ స్పెషాలిటీ‌‌‌ హాస్పిటల్‌‌‌‌ పనులు స్పీడప్‌‌‌‌ చేయాలి : సీఎస్‌‌‌‌ కె.రామకృష్ణారావు

వరంగల్‌లో మల్టీ సూపర్‌‌‌‌ స్పెషాలిటీ‌‌‌ హాస్పిటల్‌‌‌‌ పనులు స్పీడప్‌‌‌‌ చేయాలి : సీఎస్‌‌‌‌ కె.రామకృష్ణారావు

హనుమకొండ, వెలుగు : వరంగల్‌‌‌‌ నగరంలో నిర్మిస్తున్న మల్టీ సూపర్‌‌‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌ పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశించారు. సోమవారం వరంగల్‌‌‌‌కు వచ్చిన ఆయనకు ఎన్‌‌‌‌ఐటీ గెస్ట్‌‌‌‌హౌస్‌‌‌‌వద్ద వరంగల్ వెస్ట్​ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌‌‌‌రెడ్డి, కుడా చైర్మన్‌‌‌‌ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు డాక్టర్‌‌‌‌ సత్యశారద, ప్రావీణ్య, గ్రేటర్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ అశ్వినీ తానాజీ వాకడే స్వాగతం పలికారు. అనంతరం ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ స్పెషల్‌‌‌‌ చీఫ్‌‌‌‌ సెక్రటరీ వికాస్‌‌‌‌రాజ్‌‌‌‌తో కలిసి హాస్పిటల్‌‌‌‌ నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఇప్పటివరకు పూర్తయిన పనుల వివరాలను కాంట్రాక్ట్‌‌‌‌ సంస్థ ప్రతినిధులు, ఆఫీసర్లు సీఎస్‌‌‌‌కు వివరించారు. అనంతరం హాస్పిటల్‌‌‌‌ ప్రాంగణంలోని కాన్ఫరెన్స్‌‌‌‌ హాల్‌‌‌‌లో నిర్వహించిన రివ్యూలో సీఎస్‌‌‌‌ మాట్లాడారు. ఉత్తర తెలంగాణకు తలమానికంగా నిర్మిస్తున్న హాస్పిటల్‌‌‌‌ పనులపై సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి స్పెషల్‌‌‌‌ ఫోకస్‌‌‌‌ పెట్టారని, పనులను స్పీడ్‌‌‌‌గా పూర్తి చేయించాలన్న సంకల్పంతో ఉన్నారన్నారు. దేశంలోనే అత్యధిక నిధులతో, అత్యాధునిక సౌకర్యాలతో ఈ హాస్పిటల్‌‌‌‌ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. రివ్యూలో వరంగల్, హనుమకొండ కలెక్టర్లు డాక్టర్‌‌‌‌ సత్యశారద, ప్రావీణ్య, డైరెక్టర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ మెడికల్‌‌‌‌ హెల్త్‌‌‌‌ నరేంద్రకుమార్‌‌‌‌, ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ చీఫ్‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌ రాజేశ్వర్‌‌‌‌రెడ్డి, ఎస్‌‌‌‌ఈ నాగేంద్ర, ఎల్‌‌‌‌అండ్‌‌‌‌టీ ఏరియా మేనేజర్‌‌‌‌ వెంకట్‌‌‌‌రెడ్డి, కేఎంసీ ప్రిన్సిపల్‌‌‌‌ రాంకుమార్‌‌‌‌రెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్‌‌‌‌ కిశోర్‌‌‌‌ పాల్గొన్నారు.