చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ కప్పు సాధించింది. సీఎస్కే యాజమాన్యం చెన్నైలోని శ్రీవారి ఆలయంలో కప్పుతో ప్రత్యేక పూజలు చేశారు. సీఎస్కే విజయం సాధించిన ప్రతిసారి చెన్నై వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో సీఎస్కే యాజమాన్యం విమానాశ్రయం నేరుగా ఆలయానికి వెళ్లి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
వారెవ్వా.. వాట్ ఏ మ్యాచ్.. రిజర్వ్ డే ఫైనల్ మ్యాచ్ అభిమానులకు మస్త్ థ్రిల్నిచ్చింది. ఉత్కంఠ పోరులో నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. ఐదోసారి ఐపీఎల్ టైటిల్ సాధించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రవీంద్ర జడేజా(15 నాటౌట్ : 6 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ ) సంచలన బ్యాటింగ్తో సీఎస్కే 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో, ఆఖరి ఓవర్ దాకా పోరాడిన డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్కు నిరాశ తప్పలేదు.
మోహిత్ శర్మ వేసిన 15వ ఓవర్లో చెన్నై విజయానికి 13 రన్స్ అవసరమయ్యాయి. తొలి నాలుగు బంతులకు 3 రన్స్ వచ్చాయి. దో బంతికి రవీంద్ర జడేజా(15) లాంగాన్లో సిక్స్ బాదాడు. ఆఖరి బాల్కు ఫోర్ కొట్టాడు. దాంతో, చెన్నై 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. ఇంపాక్ట్ ప్లేయర్ శివం దూబే(32) నాటౌట్గా నిలిచాడు.