మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్.. నలుగురికి గాయాలు

మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్.. నలుగురికి గాయాలు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ చింతల్ బస్టాప్ సమీపంలో మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలు కడుతుండగా నలుగురికి కరెంట్ షాక్ తగిలింది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో నాగ్ నాథ్(33) అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 

రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ల పంపిణీ కోసం మంత్రి కేటీఆర్ కుత్బుల్లాపూర్ రానున్న నేపథ్యంలో ఘటన చోటు చేసుకుంది. ఈరోజు(సెప్టెంబర్ 20) ఉదయం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు.