డైలీ 67 మిలియన్ యూనిట్లు కరెంట్ వాడకం
లాక్డౌన్కి ముందు 40 మి.యూనిట్లే
ఎండలకు 24 గంటలు ఆన్లో ఉంటున్న ఏసీలు, కూలర్లు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ లో కరెంట్ వాడకం పెరిగింది. జనతా కర్ఫ్యూకు ముందు కంటే డైలీ 27 మిలియన్ యూనిట్లు ఎక్కువ వినియోగిస్తున్నారని అధికారులు చెప్తున్నారు. కొద్దిరోజుల నుంచి ఎండలు తీవ్రస్థాయిలో ఉండడంతో కూలర్లు, ఏసీల వాడకం ఎక్కువవడం ఇందుక్కారణంగా చెప్తున్నారు. దానికితోడు లాక్డౌన్ రిలాక్సేషన్స్తో కమర్షియల్యాక్టివిటీస్కూడా స్టార్ట్ అయ్యాయి.
కిందటేడుతో చూస్తే…
గ్రేటర్లో 44 లక్షలకుపైగా డొమెస్టిక్, 7 లక్షలకుపైగా కమర్షియల్, 50 వేలకుపైగా ఇండస్ట్రీ, లక్షకు పైగా స్ట్రీట్లైట్కనెక్షన్లు ఉన్నాయి. వాస్తవానికి ఏటా మే నెలలో కరెంట్వాడకం గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. ప్రస్తుతం డైలీ 67 మిలియన్ యూనిట్ల(ఎంయూ) కరెంట్ కాలుతోంది. పెరిగిన ఉష్ణోగ్రతలతో10 రోజుల నుంచి ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు 24 గంటలూ నడుస్తున్నాయి. దాంతో లాక్ డౌన్కు ముందు 40 ఎంయూలుగా ఉన్న వాడకం ఒక్కసారిగా పెరిగింది. గతేడాది మే తో చూస్తే మాత్రం ఇది తక్కువే. అప్పుడు 72 ఎంయూల యూసేజ్ఉంది. డిమాండ్ మరింత పెరిగితే అదనపు ట్రాన్స్ఫార్మర్లు అవసరమవుతాయని, ఆ మేరకు ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు.
ఈసారీ పాత బిల్లే
కరోనా ఎఫెక్ట్తో నిలిచిపోయిన బిల్లింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల కూడా గతేడాది మే నెలలో వచ్చిన బిల్లునే చెల్లించాలని అధికారులు తెలిపారు. 3 నెలలుగా వినియోగదారులు ఇదే ప్రకారం చెల్లిస్తున్నారు.
ఉద్యోగం పోతే ఈఎంఐ రద్దు
11 అంకెల సెల్ ఫోన్ నెంబర్లు రాబోతున్నాయి
కరోనా కన్నా రాక్షసం ఈ మనుషులు..