
కొత్తగూడ, వెలుగు : మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్ద ఎల్లాపూర్లో ఓ వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.2 లక్షల 30 వేలు కొట్టేశారు. బాధితుడు గుండగాని శ్రీధర్ కథనం ప్రకారం..శ్రీధర్కు ఇండియన్ బ్యాంక్లో అకౌంట్ ఉంది. ఈ నెల 26న అతడి ఫోన్కు ఇండియన్ బ్యాంక్ స్మార్ట్ ఆప్పేరుతో ఒక మెసేజ్వచ్చింది. అందులో లింక్ క్లిక్చేసి అప్డేట్ చేసుకోవాలని ఉంది.
అతడికి బ్యాంకులో అకౌంట్ఉండడంతో యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. కొంతసేపటికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి ‘మీకు లోన్ ఇస్తాం. మీ ఫోన్కు ఒక ఓటీపీ వస్తుంది. అది చెప్పండి’ అనగానే తనకు లోన్అవసరం లేదని తిరస్కరించాడు. కానీ, అదే రోజు సాయంత్రం శ్రీధర్ అకౌంట్ నుంచి రూ. 2 లక్షల 30 వేలు కట్అయినట్టు మెసేజ్వచ్చింది.
తనకు తెలియకుండానే తన అకౌంట్నుంచి డబ్బులు కాజేశారని పీఎస్తో పాటు సైబర్ క్రైమ్ నంబర్కు బాధితుడు ఫిర్యాదు చేశాడు. మెసేజ్పంపించిన రోజు నుంచే తన ఫోన్ హ్యాక్ అయినట్టు తెలిసిందని చెప్పాడు.