గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో సైబర్ మోసగాళ్లు రెచ్చిపోయారు. వాట్సప్లో వచ్చిన లింక్ను ఓపెన్ చేసిన పలువురి అకౌంట్ల నుంచి డబ్బులు మాయమయ్యాయి. గోదావరిఖనిలో ఓ సింగరేణి కార్మికుడి అకౌంట్ నుంచి రూ.30వేలు, రూ.20 వేలు, రూ.7,500, రూ,7,505 చొప్పున డబ్బులు మాయం కావడంతో బాధితుడు 1930 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు.
యైటింక్లైన్ కాలనీలో పలువురికి వాట్సప్లో వచ్చిన లింక్ ఓపెన్ చేయడంతో డబ్బులు మాయమయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తున్నారు. వాట్సప్లో వచ్చే లింక్ను ఓపెన్ చేయకుండా జాగ్రత్త పడాలని గోదావరిఖని ఏసీపీ ఎం.రమేశ్సూచించారు.
