V6 News

సెపక్ తక్రాలో సైబరాబాద్ కానిస్టేబుల్ సత్తా

సెపక్ తక్రాలో సైబరాబాద్ కానిస్టేబుల్ సత్తా

గచ్చిబౌలి, వెలుగు: అఖిల భారత పోలీస్‌‌ సెపక్ తక్రా చాంపియన్‌‌షిప్‌‌ పోటీల్లో సైబరాబాద్‌‌ సీఎస్‌‌డబ్ల్యూ విభాగానికి చెందిన కానిస్టేబుల్‌‌ ఎన్.మనోజ్‌‌కుమార్‌‌ వరుసగా మూడు సంవత్సరాలు ప్రతిభ చాటుతూ మొత్తం ఐదు కాంస్య పతకాలు సాధించాడు. దక్షిణ ఆసియాకు చెందిన వేగవంతమైన ఈ క్రీడలో కాళ్లు, మోకాళ్లు, ఛాతి, భుజాలు ఉపయోగించి గాలిలోనే బంతిని నెట్‌‌ పైకి వేయాలి.

హర్యానా మధుబన్‌‌లో 2025లో జరిగిన 73వ ఆల్‌‌ ఇండియా పోలీస్‌‌ సెపక్ తక్రా చాంపియన్‌‌షిప్​లో మనోజ్​ నిలకడమైన ప్రదర్శనతో పతకం సాధించాడు. జలంధర్‌‌లో 2022లో జరిగిన 71వ, నాగ్‌‌పూర్‌‌లో 2024లో నిర్వహించిన 72వ చాంపియన్​షిప్​లోనూ ఆయన పతకాలు సాధించాడు.