
గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ పోలీసులు 45 రోజుల్లో రూ.3.20 కోట్ల విలువైన 1,061 సెల్ఫోన్లను రికవరీ చేశారు. వీటిని గచ్చిబౌలిలోని కమిషనరేట్ కార్యాలయంలో బాధితులకు గురువారం అందజేశారు. సెల్ఫోన్ పోగొట్టుకున్నా లేదా దొంగలించబడినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో లేదా సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సూచించారు. 2023 నుంచి సీసీఎస్ సైబరాబాద్, ఐటీ సెల్ సహాయంతో 13,423 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. క్రైమ్ ఏడీసీపీ రామ్కుమార్, ఏసీపీ నాగేశ్వర్రావు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, బాధితులు పాల్గొన్నారు.