ఏఐ టూల్స్ వాడి .. రూ.850 కోట్ల భారీ ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్

ఏఐ టూల్స్ వాడి .. రూ.850 కోట్ల భారీ ఇన్వెస్ట్ మెంట్  ఫ్రాడ్
  • ఏఐ టూల్స్, నకిలీ వెబ్​సైట్స్, స్టాక్​ మార్కెట్ ​ఫేక్ ​ప్రిడిక్షన్స్ పేరుతో 3,164 మందికి టోకరా
  • ఇద్దరిని అరెస్ట్​ చేసిన సైబరాబాద్​ పోలీసులు 

హైదరాబాద్ ​సిటీ, వెలుగు : ఏఐ టూల్స్​వాడి.. నకిలీ వెబ్​సైట్స్, స్టాక్ ​మార్కెట్ ఫేక్​​ప్రిడిక్షన్స్ ​పేరుతో 3,164 మందిని మోసం చేసి రూ.850 కోట్ల ఇన్వెస్ట్​మెంట్ ఫ్రాడ్​చేసిన ఇద్దరిని సైబరాబాద్​పోలీసులు అరెస్ట్​చేశారు. ఈ స్కామ్​లో వేర్వేరు రాష్ట్రాలకు చెందిన సుమారు 3వేల మంది బాధితులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సైబరాబాద్​ఎకనామిక్​అఫెన్స్​వింగ్​పోలీసుల కథనం ప్రకారం.. ఏపీకి చెందిన గడ్డం వేణుగోపాల్ మణికొండలో ఉంటున్నాడు. శ్రీనివాస్ అనలిటికల్ ప్రైవేట్ లిమిటెడ్, ఏవీ సొల్యూషన్స్​కు డైరెక్టర్ గా ఉన్నాడు. ఇతను ఏవీ సొల్యూషన్​ఉద్యోగి శ్రేయస్ పాల్ తో కలిసి మోసాలకు తెరతీశాడు. ఏఐ ప్లాట్​ఫారమ్​లు, ఫోంజీ స్కీమ్, ఫేక్​స్టాక్​మార్కెట్​ప్రిడిక్షన్స్ పేరుతో బాధితుల నుంచి పెట్టుబడులు పెట్టించేవారు. పెట్టబుడిదారులకు 7 శాతం నెలనెలా ఆదాయం ఉంటుందని నమ్మించేవారు.​ 

వీరు ఐఐటీ క్యాపిటల్​టెక్నాలజీస్ మాదాపూర్, ఏవీ సొల్యూషన్స్ కొండాపూర్, శ్రీనివాస్​అనాలటిక్స్ ప్రైవేట్​లిమిటెడ్, ట్రేడ్​బుల్స్​టెక్నాలజీ కంపెనీలను నడుపుతున్నట్టు బాధితులను నమ్మించేవారు. అలాగే, వీరు ఎనిమిది రకాల ఫేక్​వైబ్​సైట్లను సృష్టించి, మధ్యతరగతి వారిని, వర్కింగ్​ఫ్రొఫెషనల్స్, రిటైర్డ్​అయిన వారిని టార్గెట్​ చేసేవారు. ఐఐటీ స్టాక్​మార్కెట్, మై షేర్​ప్రాఫిట్, ఏవీగ్రూప్స్, ఫెహుఫిన్, ట్రేడ్​ఆన్​నంబర్స్, స్మాల్​గో, శ్రీమాతా, మహేశ్వర​అడ్వైజరీ సర్వీసెస్​ల పేరుతో వెబ్​సైట్లను సృష్టించారు. ఒక్కసారి ఇన్వెస్ట్​ చేస్తే నెలకు 7 శాతం, ఏడాదికి 84శాతం ఆదాయం వస్తుందని నమ్మించారు. వీరి ఫ్రాడ్​పై సైబరాబాద్​ఎకానమిక్స్​అఫెన్స్​ వింగ్​కు వచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసి మంగళవారం వేణుగోపాల్​ను, శ్రేయస్​పాల్​ను అరెస్ట్​ చేశారు. వీరి నుంచి టయోటా ఫార్చునర్​, 11 ల్యాప్​టాప్​లు, 14 చెక్​బుక్​లు, 30 ప్రామిసరీ నోట్స్​స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.