హైదరాబాద్లో వర్షాల కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐటీ కంపెనీల ఉద్యోగులందరూ ఒకేసారి కాకుండా.. మూడు షిఫ్టుల్లో లాగ్ అవుట్ చేయాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. ఈ మేరకు మాదాపూర్ డీసీపీ సందీప్ కుమార్మంగళవారం అడ్వైజరీ నోట్ విడుదల చేశారు.
గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐటీ కంపెనీల ఉద్యోగులందరూ ఒకేసారి కాకుండా.. మూడు షిఫ్టుల్లో లాగ్ అవుట్ చేయాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. ఈ మేరకు మాదాపూర్ డీసీపీ సందీప్కుమార్మంగళవారం అడ్వైజరీ నోట్ విడుదల చేశారు. అందులో ఏయే టైమింగ్స్ లో, ఏ రూట్లోని కంపెనీల ఉద్యోగులు లాగ్ అవుట్ చేయాలో పేర్కొన్నారు. ఇవి బుధవారం వరకు అమల్లో ఉండనున్నాయి. తమ సూచనను అన్ని కంపెనీలు పాటించాలని డీసీపీ కోరారు.
ఎవరెప్పుడు లాగ్ అవుట్ చేయాలంటే..
ఫేజ్1: మధ్యాహ్నం 3 గంటలు
ఐకియా నుంచి సైబర్ టవర్స్ రూట్లో ఉన్న ఐటీ కంపెనీల ఉద్యోగులు మధ్యాహ్నం 3 గంటలకు లాగ్ అవుట్ చేయాలి. ఈ రూట్లో టీసీఎస్, హెచ్ఎస్బీసీ, డెల్, ఒరాకిల్, క్వాల్కమ్, టెక్మహీంద్ర, రహేజా మైండ్స్పేస్, ఫినిక్స్లోని ఐటీ కంపెనీలు ఉన్నాయి.
ALSO READ :స్కూళ్లు, కాలేజీలకు.. ఇయ్యాల, రేపు సెలవు
ఫేజ్2: సాయంత్రం 4:30 గంటలు
ఐకియా, బయోడైవర్సిటీ, రాయదుర్గంలో ఉన్న ఐటీ కంపెనీల ఉద్యోగులు సాయంత్రం 4:30 గంటలకు లాగ్ అవుట్ చేయాలి. ఈ ప్రాంతాల్లో నాలెడ్జ్సిటీ, నాలెడ్జ్ పార్క్, టీహబ్, గెలాక్సీ, ఎల్టీఐ అండ్ ట్విజ, స్కైవ్యూ, దివ్యశ్రీ ఓరియన్ బిల్డింగ్లోని కంపెనీలు ఉన్నాయి.
ఫేజ్3: మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటలు
ఫైనాన్షియల్ డిస్ర్టిక్ట్, గచ్చిబౌలి ఏరియాల్లో ఉన్న ఐటీ కంపెనీల ఉద్యోగులు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య లాగ్ అవుట్ చేయాలి. ఈ ప్రాంతాల్లో మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో, సెంచురీస్, బ్రాడ్వే, వర్చుసా, బీఎస్ఆర్ ఐటీ పార్కు, ఐసీఐసీఐ, అమెజాన్, హనీవెల్, హిటాచీ, సత్వ క్యాపిటల్, క్యాప్జెమినీ, క్యూసిటీ, వేవ్రాక్, డీఎల్ఎఫ్లోని కంపెనీలు ఉన్నాయి.