
న్యూఢిల్లీ: 2024లో సైబర్ నేరస్థుల వల్ల ప్రజలు రూ.22,845.73 కోట్లకు పైగా నష్టపోయారని కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభకు వెల్లడించింది. ఇది గతేడాది కంటే దాదాపు 206 శాతం ఎక్కువని హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. గతేడాది ఈ నష్టం రూ.7,465.18 కోట్లు నమోదైందని తెలిపారు. జాతీయ సైబర్ నేరాల రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ), మంత్రిత్వ శాఖ ఐ4సీ నిర్వహించే సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్) ప్రకారం.. 2024లో సైబర్ నేరస్థులు చేసిన ఆర్థిక మోసాల ఘటనలు 36,37,288 నమోదయ్యాయని సంజయ్ చెప్పారు.
అలాగే, 2022లో 10,29,026, 2023లో 15,96,493, 22,68,346 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఆర్థిక మోసాలను వెంటనే నివేదించడానికి, మోసగాళ్లు నిధులను దుర్వినియోగం చేయడాన్ని ఆపడానికి 2021లో సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్)ను ప్రారంభించినట్టు ఆయన చెప్పారు. సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్ ప్రకారం, ఇప్పటివరకు 17.82 లక్షలకు పైగా ఫిర్యాదులు నమోదు కాగా.. రూ. 5,489 కోట్లకు పైగా ఆర్థిక మొత్తాన్ని రికవరీ చేసినట్టు మంత్రి వెల్లడించారు.