ఆదిలాబాద్ టౌన్, వెలుగు: దేశ వ్యాప్తంగా సైబర్నేరాలకు పాల్పడుతున్న నిందితుడిని ఆదిలాబాద్ జిల్లా మావల పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఎస్సై రాజశేఖర్ రెడ్డి వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని అంబర్పేటకు చెందిన మహమ్మద్ ఫారూఖ్ మరణించిన వారి కుటుంబసభ్యులకు సహాయం చేస్తామని నమ్మించి దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నాడు.
ఆదిలాబాద్లోని కైలాస్నగర్కు చెందిన మహమ్మద్ అఖీల్ అహ్మద్కు ఈ నెల 8న నిందితుడు వాట్సాప్ కాల్చేసి చనిపోయిన మీ అన్న అస్లాం మౌలానాకు తాను శ్రేయోభిలాషినని చెప్పి మాట్లాడాడు. అనంతరం రూ. లక్ష ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి నకిలీ ట్రాన్సాక్షన్ స్ర్కీన్ షాట్లు పంపాడు. అనంతరం వివిధ కారణాలు చెప్పి కొన్ని డబ్బులు తిరిగి పంపమని కోరాడు.
దీంతో బాధితుడు అఖీల్ విడతల వారీగ రూ.58,500 నిందితుడికి పంపాడు. చివరకు మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు మావలలో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. ఫారూఖ్పై తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, బిహార్లో 37 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచించారు.
