ముంచుకొస్తున్న తౌక్టే తుఫాన్.. 5 రాష్ట్రాలకు ముప్పు

ముంచుకొస్తున్న తౌక్టే తుఫాన్.. 5 రాష్ట్రాలకు ముప్పు

చెన్నై: తుఫాన్ ముప్పు ముంచుకొస్తోంది. తౌక్టేగా పిలుస్తున్న ఈ తుఫాన్.. మరో 12 గంటల్లో ప్రమాదకరంగా మారొచ్చునని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ తుఫాన్ మంగళవారం గుజరాత్ తీరాన్ని తాకే అవకాశం ఉందని సమాచారం. మంగళవారం మధ్యాహ్నం గుజరాత్ లోని పోరుబందర్, నలియాను తౌక్టే దాటే అవకాశం ఉందని తెలిసింది. గుజరాత్ తోపాటు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ర్టలకు ఈ తుఫాను ముప్పు పొంచి ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కు చెందిన 50 టీమ్స్ ను ఆయా రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో మోహరించారు. ఈ తుఫాన్ ప్రభావంతో కేరళ, కర్ణాటక, గోవాల్లోని తీర ప్రాంత జిల్లాల్లో ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ తెలిపింది.