జీడిమెట్ల, వెలుగు: డి.పోచంపల్లి విద్యుత్సెక్షన్ లైన్ఇన్స్పెక్టర్ వి.హరికృష్ణరాజుపై సస్పెన్షన్వేటు పడింది. జీడిమెట్ల డీఈ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. డి.పోచంపల్లి సెక్షన్పరిధిలో ఇటీవల బస్తీబాట కార్యక్రమం నిర్వహించగా ఛీప్ ఇంజినీర్హాజరయ్యారు. ఆ సమయంలో ఎల్టీ నెట్వర్క్ ప్రపోజ్ చేయకుండా విద్యుత్స్తంభాలను ఏర్పాటు చేయకుండానే పెద్ద ఎత్తున విద్యుత్సర్వీసులను జారీ చేసినట్లు గుర్తించారు.
సీఈ ఆదేశాలతో విచారణ జరిపిన అధికారులు లైన్ఇన్స్పెక్టర్హరికృష్ణరాజు విధుల్లో నిర్లక్ష్యం వహించి సంస్థకు నష్టం వచ్చేలా చేయడంతోపాటు అక్రమాలకు పాల్పడినట్లు తేల్చారు. దీంతో ఆయనను సస్పెండ్చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈ లైన్ఇన్స్పెక్టర్విద్యుత్కాంట్రాక్టర్గా వర్క్చేస్తారని, ఆయనకు వర్క్ఇవ్వని వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు ఆరోపణలున్నాయి. ఏకంగా ప్యానల్బోర్డు కంపెనీ ఏర్పాటు చేసినట్లు
సమాచారం.
