పని పోయిందని కూలీ సూసైడ్

పని పోయిందని కూలీ సూసైడ్

పేపరు మిల్లులో పని పోవడంతో మనస్తాపం

కాగ జ్ నగర్, వెలుగు: లాక్ డౌన్ వల్ల పని దొరక్క వలస కూలీ సూసైడ్ చేసుకున్న విషాద ఘటన కాగజ్ నగర్ లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన వికాస్ చౌహాన్ (21) సిర్పూర్ పేపర్ మిల్లులో కాంట్రాక్టర్ దగ్గర కూలీ పని చేసేవాడు. లాక్ డౌన్ వల్ల మిల్లులో పని ఆగిపోయింది. కొన్ని రోజులుగా పనిలేక ఇబ్బందులు పడుతున్నాడు. గురువారం ఉదయం ఎస్పీఎం ఓల్డ్ కాలనీలోని క్వార్టర్ లో ఉరి వేసుకున్నాడు. పని దొరక్కపోవడం, సొంతూరికి వెళ్లే అవకాశం లేకపోవడంతో సూసైడ్ చేసుకుని ఉంటాడని ఎస్ఐ రవికుమార్ చెప్పారు. తోటి కూలి వెంకట్ చౌహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.