హైదరాబాద్, వెలుగు: హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ దళిత బంధును ఆపేస్తారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్అన్నారు. ఏడేండ్లుగా దళితులను సీఎం కేసీఆర్ మోసం చేస్తూనే ఉన్నారని విమర్శించారు. హుజూరాబాద్ లో జరిగిన కార్యక్రమం ప్రభుత్వ సమావేశంలా లేదని, పార్టీ సమావేశంలా ఉందని మండిపడ్డారు. ఆ మీటింగ్లో పాడి కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్లు ఎందుకున్నారని ఆయన ప్రశ్నించారు. మంగళవారం గాంధీ భవన్లో దాసోజు మీడియాతో మాట్లాడారు. ‘సీఎస్ సోమేశ్ కుమార్ చిల్లరగా వ్యవహరిస్తున్నారు. కలెక్టర్ కర్ణన్ కూడా పింక్ కలర్ హోర్డింగులు పెడుతున్నారు. కేసీఆర్ తాలిబన్ల మాదిరిగా ప్రభుత్వ వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నారు. హుజూరాబాద్సభలో కేసీఆర్ నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పి తన క్రెడిబిలిటీని పోగొట్టుకున్నారు. ఏడేండ్లలో ఒక్కసారి కూడా అంబేద్కర్విగ్రహానికి పూల దండ వేయని కేసీఆర్ను దళితులు నమ్మరు. నేరెళ్లలో దళితుల పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించారో అందరికీ తెలుసు. ఇన్నేండ్లలో మొదటిసారి సీఎంవోలోకి ఒక దళిత ఐఏఎస్ అడుగుపెడుతున్నారు. సబ్ ప్లాన్ కింద దళితులకు ఖర్చు చేయాల్సిన సొమ్మంతా వేరే పనులకు డైవర్ట్ చేశారు. బుధవారం జరిగే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో కేసీఆర్జిత్తులన్నీ ఎండగడతాం..’ అని దాసోజు చెప్పారు. దళితులకు మూడెకరాల భూపంపిణీని సీఎం కేసీఆర్ గాలికొదిలేశారని మాజీ ఎంపీ మల్లు రవి విమర్శించారు. చివరకు దళిత బంధుకు కూడా అదే గతి పట్టిస్తారన్నారు.
హుజూరాబాద్ ఎన్నికలైపోతే ‘దళిత బంధు’ బంద్
- తెలంగాణం
- August 18, 2021
లేటెస్ట్
- IPL 2024: సన్ రైజర్స్ ఘోర ఓటమి..6 ఓటముల తర్వాత ఆర్సీబీ విజయం
- పటాన్ చెరులో భారీగా గంజాయి పట్టివేత
- తెలంగాణ కోసమే దేవుడు నన్ను పుట్టించిండు:కేసీఆర్
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- PM Kisan: రైతులకు పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?
- జగన్ కోసం జనంలోకి భారతి..
- బర్గర్ ఒకరి ప్రాణం తీసింది.. మరొకరిని జైలుకు పంపింది..
- కాంగ్రెస్ లేకుండా చేయాలనుకుండు.. కేసీఆరే ఖతం అయ్యిండు: రాజగోపాల్ రెడ్డి
- IPL 2024: పటిదార్, కోహ్లీ మెరుపులు.. సన్ రైజర్స్ ముందు భారీ లక్ష్యం
- ఓట్ల కోసమే బీజేపీ తలంబ్రాల రాజకీయం: పొన్నం ప్రభాకర్
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు