
ముగ్గురు స్టూడెంట్లతో సహా రాజస్థాన్లో నలుగురి అరెస్ట్
జైపూర్: రాజస్థాన్లోని జోధ్పూర్లో దళిత బాలికపై ఆదివారం గ్యాంగ్రేప్జరిగింది. బాలిక బాయ్ఫ్రెండ్సమక్షంలోనే ముగ్గురు కాలేజీ స్టూడెంట్లు ఆమెపై అత్యాచారం చేశారు. ముందుగా బాలిక స్నేహితుడిపై దాడి చేసిన నిందితులు అనంతరం మైనర్బాలికను రేప్చేశారని, నిందితులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. టీనేజ్లవర్స్ శనివారం అజ్మీర్నుంచి పారిపోయి బస్సులో రాత్రి 10.30కు జోధ్పూర్ చేరుకున్నారు. గెస్ట్హౌస్లో రూమ్కోసం వెళ్లగా అక్కడ కేర్టేకర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో వారు అక్కడ నుంచి బయటకు వచ్చేశారని సీనియన్ పోలీస్అధికారి అమ్రిత దుహాన్ తెలిపారు. వీరిద్దరు గెస్ట్హౌస్ బయట నిలబడి ఉండగా ముగ్గురు నిందితులు సమందర్సింగ్, ధర్మపాల్ సింగ్, భతమ్సింగ్వారిని కలసి రూమ్, ఫుడ్ఇస్తామని ప్రామిస్చేసి తమవెంట తీసుకువెళ్లారు. జేఎన్వీయూ ఓల్డ్క్యాంపస్లోని హాకీ గ్రౌండ్కి చేరుకున్న తరువాత బాలుడిపై దాడిచేసి బాలికపై సామూహిక అత్యాచారం చేసి పారిపోయారు. అనంతరం మార్నింగ్ వాకర్స్ ను బాధిత టీనేజర్లు సాయం కోరగా వారు పోలీసులకు సమాచారం అందించారు. డాగ్స్క్వాడ్, ఫోరెన్సిక్టీమ్ తో నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి జోధ్పూర్లోని గణేశ్పురలో ఉన్న ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. గెస్ట్హౌస్ కేర్టేకర్ను కూడా అరెస్టు చేశామని వెల్లడించారు.