ఏడేండ్ల తర్వాత సీఎంవోలోకి దళిత ఆఫీసర్

ఏడేండ్ల తర్వాత సీఎంవోలోకి దళిత ఆఫీసర్

ఈటల వ్యాఖ్యలతో దిగొచ్చిన సీఎం

హైదరాబాద్, వెలుగు: ఏడేండ్ల తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి ఆఫీస్ లో దళిత ఆఫీసర్​కు చోటు దక్కింది. సీఎంవోలోకి రాహుల్  బొజ్జాను తీసుకుంటున్నట్టు సోమవారం హుజూరాబాద్​ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. సీఎంవోలో ఒక్క దళిత అధికారి కూడా లేరనే విషయాన్ని టీఆర్​ఎస్​కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టైంలో ఈటల రాజేందర్​ లేవనెత్తారు. ఒక్క ఎస్సీ, ఎస్టీ అధికారి కూడా సీఎం ఆఫీస్ లో లేకుండా ఆయా వర్గాలకు ఎలా న్యాయం చేస్తారని  ప్రశ్నించారు. ఈటల వ్యాఖ్యలతో డిఫెన్స్ లో పడ్డ కేసీఆర్.. ఎట్టకేలకు సీఎంవోలో దళిత ఐఏఎస్​కు చాన్స్​ ఇచ్చారు.