ఈటల వ్యాఖ్యలతో దిగొచ్చిన సీఎం
హైదరాబాద్, వెలుగు: ఏడేండ్ల తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి ఆఫీస్ లో దళిత ఆఫీసర్కు చోటు దక్కింది. సీఎంవోలోకి రాహుల్ బొజ్జాను తీసుకుంటున్నట్టు సోమవారం హుజూరాబాద్ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. సీఎంవోలో ఒక్క దళిత అధికారి కూడా లేరనే విషయాన్ని టీఆర్ఎస్కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టైంలో ఈటల రాజేందర్ లేవనెత్తారు. ఒక్క ఎస్సీ, ఎస్టీ అధికారి కూడా సీఎం ఆఫీస్ లో లేకుండా ఆయా వర్గాలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఈటల వ్యాఖ్యలతో డిఫెన్స్ లో పడ్డ కేసీఆర్.. ఎట్టకేలకు సీఎంవోలో దళిత ఐఏఎస్కు చాన్స్ ఇచ్చారు.