హుజురాబాద్ ఆర్డీవో ఆఫీసు ఎదుట దళితబంధు కోసం ధర్నా

హుజురాబాద్ ఆర్డీవో ఆఫీసు ఎదుట దళితబంధు కోసం ధర్నా

కరీంనగర్ జిల్లా: హుజురాబాద్ ఆర్డీఓ ఆఫీసు ఎదుట దళితులు ఆందోళనకు దిగారు. దళితబంధుకు పొందడానికి తమకు అన్ని అర్హతలున్న దళితబంధును ఎందుకు ఇవ్వటం లేదంటూ ధర్నా చేపట్టారు. సుమారు 400 మంది ఆందోళనలో పాల్గొన్నారు. దరఖాస్తులు పట్టుకుని ఆర్డీవో ఆఫీసు ముందు బైఠాయించి ధర్నా చేశారు.

అయితే దళితబంధు రానివారంతా దరఖాస్తులు ఇస్తే కలెక్టర్ కు పంపిస్తామని ఏవో జగత్ సింగ్ వారిని కోరారు. దరఖాస్తులు పంపడం వరకే తన బాధ్యత అని..దళితబంధు ఇచ్చే బాధ్యత తనది కాదన్నారు. దీంతో ఆందోళనకారులు ఏవోకు దరఖాస్తులు అందజేశారు. ఈ సారి దళితబంధు రాకుంటే కరీంనగర్ కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేస్తామని నిరసనకారులు హెచ్చరించారు.