ఇంటికి చేరుకున్న బాలిక మృతదేహం

ఇంటికి చేరుకున్న బాలిక మృతదేహం

దమ్మాయిగూడలో బంధువులు, స్థానికుల ఆందోళన మధ్య చిన్నారి మృతదేహం ఇంటికి చేరుకుంది. బంధువులు, స్థానికులకు ఆందోళన మధ్య పోలీసులు డెడ్ బాడీని ఇంటికి తరలించారు. చిన్నారి కడసారి చూపుల కోసం వేలాది మంది తరలివచ్చారు. చిన్నారిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.  స్థానిక నాయకులు సైతం బాలిక మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిన్నటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన కూతురు ఈ రోజు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో  మునిగిపోయారు. హృదయవిదారకంగా రోదిస్తున్న వారిని సముదాయించడం ఎవరి వల్లా కావడం లేదు.

ఇదిలా ఉంటే బాలిక మృతిపై బంధువులు, స్థానికుల ఆందోళన కొనసాగుతోంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ వారు ఆందోళనకు దిగారు. పోలీస్ పెట్రోలింగ్ వాహనంపై రాళ్లతో దాడికి ప్రయత్నించారు. బాదిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.