ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ మతిలేకుండా మాట్లాడుతుండు : దానం నాగేందర్

ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ మతిలేకుండా మాట్లాడుతుండు :  దానం నాగేందర్

మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అర్థరహిత విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే దానం నాగేందర్. ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ మతిలేకుండా మాట్లాడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డిని దింపుతామని మాట్లాడుతున్న వారికి లోక్ సభ ఎన్నికల్లో బుద్ధిచెప్తామని అన్నారు. బీజేపీ దేవుళ్ల పేరు చెప్పుకుని ఓట్లు అడుగుందని మండిపడ్డారు. 

పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు దానం నాగేందర్.  సనత్ నగర్ నియోజకవర్గ బూత్ స్థాయి నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.   ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ నాయకురాలు కోట నీలిమ,విజయ,ఫిరోజ్ ఖాన్ హాజరయ్యారు.  

సనత్ నగర్ లో కాంగ్రెస్ కు మంచి ఆదరణ ఉందని అన్నారు దానం నాగేందర్..కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించుకుని అందరూ కలిసి పార్టీ గెలుపుకు కృషి చేయాలని అన్నారు. బూత్ కమిటీలను ఏర్పాటు చేసి ఓటింగ్ ప్రక్రియ సవ్యంగా జరిగేలా అందరూ పని చేయాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంఉందని, దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలవుతున్న ఆరు గ్యారెంటీల ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలని కోరారు.