హాఫ్ సెంచరీ కొట్టేసిన ధనుష్.. ఇక నుండి దర్శకుడిగా కూడా!

హాఫ్ సెంచరీ కొట్టేసిన ధనుష్.. ఇక నుండి దర్శకుడిగా కూడా!

తమిళ స్టార్ హీరో ధనుష్(Danush) తన కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం అయన "కెప్టెన్ మిల్లర్(Captain Miller)" అనే సినిమా చేస్తున్నారు. అరుణ్ మాతేశ్వరన్(Arun Matheshwaran) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయింది. గత కొంత కాలంగా ఈ సినిమా కోసం గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ తో కనిపించిన ధనుష్.. లేటెస్ట్ సినిమా కోసం లుక్ మొత్తం మార్చేశారు.

ఈ సినిమాలో ధనుష్ గుండులో కనిపించనున్నారు. ఇటీవల తిరుమల వెళ్లిన ధనుష్.. స్వామివారికి తన తలనీలాలు అర్పించుకున్నారు. ధనుష్ గుండుతో తిరుమలలో కనిపించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ తరువాతి రోజే ధనుష్ తన కొత్త సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ఇందుకు సంబందించిన అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ధనుష్ గుండుతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ALSO READ :అరె ఓ మార్క్.. రాస్కోరా.. బ్రో మూవీ నుండి పవన్ డైలాగ్ వైరల్

ఈ సినిమా విషయంలో ఆడియన్స్ కు మరో సర్ప్రైజ్ ఇచ్చారు ధనుష్. అదేంటంటే.. ధనుష్ కెరీర్ లో 50వ సినిమాగా రానున్న ఈ మూవీకి ఆయనే స్వయంగా దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి కెరీర్ లో మొదటిసారి మెగాఫోన్ పట్టనున్న ధనుష్.. ఆ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి.