అరె ఓ మార్క్.. రాస్కోరా.. బ్రో మూవీ నుండి పవన్ డైలాగ్ వైరల్

అరె ఓ మార్క్.. రాస్కోరా.. బ్రో మూవీ నుండి పవన్ డైలాగ్  వైరల్

గబ్బర్ సింగ్(Gabbar singh) సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) చెప్పిన "అరె ఓ సాంబ.. రాస్కోరా" అనే డైలాగ్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హరీష్ శంకర్(Harish shankar) మాస్ టైమింగ్ లో సెట్ చేసిన ఈ డైలాగ్ ను.. ఇప్పటికీ చాలా మంది యూజ్ చేస్తూనే ఉంటారు. అయితే ఈ డైలాగ్ ను మరోసారి రిపీట్ చేయనున్నారట పవన్. అది కూడా ఆయన లేటెస్ట్ మూవీ "బ్రో(Bro)" మూవీ కోసం. 

మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్(sai dharam tej) ఈ సినిమాలో కీ రోల్ లో కనిపించనున్నారు. తమిళ హిట్ మూవీ వినోదయ సీతమ్(Vinodaya seetham) కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు.. సముద్రఖని(Samitirakhani) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రిలీజైన ఈ మూవీ టీజర్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. 

ALSO READ :రైలు ప్రమాదంతో.. రద్దయిన, మళ్లించిన రైళ్లు ఇవే

అయితే తాజాగా ఈ సినిమా నుండి వినిపిస్తున్న న్యూస్ ఒకటి ఫ్యాన్స్ కు కిక్కిస్తోంది. అదేంటంటే.. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ చెప్పిన "అరె ఓ సాంబ.. రాస్కోరా" అనే డైలాగ్ ను బ్రో సినిమా కోసం మళ్ళీ వాడేస్తున్నారట. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ పేరు మార్కండేయ. అందుకే గబ్బర్ సింగ్ డైలాగ్ కాస్త మార్చి.. "అరె ఓ మార్కు.. రాస్కోరా" అని పెట్టారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో.. కేవలం డైలాగ్ మాత్రమే కాదు గబ్బర్ సింగ్ మ్యాజిక్ కూడా మళ్ళీ రిపీట్ అవడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.