కాసీం రజ్వీకి పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. కేసీఆర్ అహంకారంతో మాట్లాడటం సరికాదన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం స్థాయిని దిగజార్చేలా కేసీఆర్ మాట్లాడారని అన్నారు. అశ్వత్థామ రెడ్డి, థామస్ రెడ్డిని పెంచి పోషించింది కేసీఆర్ కాదా ? అని ప్రశ్నించారు. ఆర్టీసీ ఆస్తులు, అప్పులు, ఆదాయం మీద శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ పుట్టక ముందే యూనియన్లు ఉన్నాయన్నారు.యూనియన్లు కార్మికుల రాజ్యాంగ పరమైన హక్కు అని అన్నారు. హుజూర్ నగర్ లో గెలిచాం కాబట్టి ఏం చేసినా చెల్లుతుందనుకోవడం తప్పన్నారు. ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులతో సమ్మె చేయించి ఇప్పుడు వారిని తూలనాటాలనడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి జర్నలిస్టులను తిట్టడం మంచి పద్ధతేనా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని తిట్టొచ్చా అంటున్న కేసీఆర్ ఆనాడు సోనియాను తిట్టినప్పుడు గుర్తుకు రాలేదా? అన్నారు.