ప్రశాంత్ కిషోర్ తో కేసీఆర్ రూ.500 కోట్ల ఒప్పందం

ప్రశాంత్ కిషోర్ తో కేసీఆర్ రూ.500 కోట్ల ఒప్పందం

హైదరాబాద్, వెలుగు: ఒక బీహార్​ వ్యక్తి, మరో కర్నాటక వ్యక్తి వచ్చి తెలంగాణలో రాజకీయం చేస్తే కేసీఆర్​ గెలుస్తడా? ఆయన ఎన్ని కుప్పిగంతులు వేసినా వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ​కుమార్​అన్నారు. సోమవారం గాంధీభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్ ​కిశోర్, ప్రకాశ్​రాజ్​లు వచ్చి ఇక్కడ రాజకీయం చేయాలని చూస్తే ప్రయోజనం లేదన్నారు. ప్రజల రక్తమాంసాలను దోచుకొని కేసీఆర్ ​రూ.500 కోట్లు పెట్టి ప్రశాంత్​ కిశోర్​తో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. పీకే రాజకీయ వ్యభిచారి అని, ఆయన ఎప్పుడు ఏ పార్టీతో పని చేస్తారో తెలియదన్నారు. ప్రకాశ్ రాజ్ మంచి నాయకుడని, ఆయన కేసీఆర్​తో కాకుండా తెలంగాణ నిరుద్యోగులతో కలిసి పని చేయాలన్నారు. అట్లా కాకుండా తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలను పాతర వేసిన కేసీఆర్​పక్కన నిలబడటం సిగ్గు చేటన్నారు. కేసీఆర్​ శీర్షాసనం వేసినా ఈసారి గెలవడని ఆయన అన్నారు.