రిలయన్స్ ఏరోస్పేస్ లో దసో వాటా పెంపు

రిలయన్స్ ఏరోస్పేస్ లో దసో వాటా పెంపు

న్యూఢిల్లీ: ఫ్రాన్స్​కు చెందిన దసో ఏవియేషన్​ భారత్​లోని దసో​ రిలయన్స్ ఏరోస్పేస్​ (డీఆర్​ఏఎల్​)లో తన వాటాను 2 శాతం పెంచుకోనుంది. దీనితో డీఆర్​ఏఎల్​లో దసో​ ఏవియేషన్​ వాటా 49 శాతం నుంచి 51 శాతానికి పెరుగుతుంది. డీఆర్​ఏఎల్​ సంస్థ దసో ఏవియేషన్​కు అనుబంధ సంస్థగా మారుతుంది.

 ప్రస్తుతం డీఆర్​ఏఎల్​లో రిలయన్స్​ ఏరోస్పేస్​ (ఆర్​ఏఎల్​)కు 51 శాతం వాటా ఉంది. ఈ లావాదేవీల తర్వాత రిలయన్స్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ అయిన ఆర్​ఏఎల్​ వాటా 49 శాతానికి తగ్గుతుంది. ఈ వాటా పెంపు ద్వారా భారత్​తో పాటు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు గ్యారెంటీలు, వారెంటీలను బలోపేతం చేయాలని దసో లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల రిలయన్స్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​కు రూ. 176 కోట్లు వస్తాయి.