
ఎల్లారెడ్డి ,వెలుగు : కాంగ్రెస్ బలోపేతానికి కష్టపడే లీడర్కే డీసీసీ ప్రెసిడెంట్పదవి దక్కుతుందని, అందుకే అభిప్రాయ సేకరణ చేపట్టామని ఏఐసీసీ అబ్జర్వర్, రాజ్యసభ ఎంపీ రాజ్ పాల్ కరోల అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని స్నేహ ఫంక్షన్ హాల్ లో సంఘటన్ సృజన్ అభియాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలన్నారు. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా కాంగ్రెస్ పని చేస్తుందన్నారు. అనంతరం ‘ఓట్ చోర్ గడ్డి చోడ్’ రాహుల్గాంధీ పోరాటానికి ప్రజా మద్దతు కోసం సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్మోహన్, పార్టీ మండలాధ్యక్షుడు కుర్మ సాయిబాబా, పార్టీ శ్రేణులు
పాల్గొన్నారు.