డీడీల గోల్ మాల్ .. ఐదుగురు సస్పెండ్

డీడీల గోల్ మాల్ .. ఐదుగురు సస్పెండ్

హైదరాబాద్: బల్దియా సర్కిల్​ ఆఫీసులో డీడీల గోల్​ మాల్​పై ప్రాథమిక విచారణ అనంతరం బాధ్యులైన ఐదుగురు అధికారులను కమిషనర్​లోకేష్ కుమార్ సస్పండ్​ చేశారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత మరికొందరిపై వేటు పడే అవకాశం ఉంది. మూసాపేట్​సర్కిల్​లోని ఇంజనీరింగ్​విభాగంలో సూపరింటెండెంట్​పద్మావతి, హెడ్ డ్రాఫ్ట్ మెన్ శ్రావణి కాంట్రాక్టర్ల నుంచి సెక్యూరిటీ డిపాజిట్​కోసం సేకరించిన 146 డీడీలను పక్కదారి పట్టిచ్చినట్లు గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ. 40 లక్షలుగా ఉంది. మరో 119 డీడీల్లో రూ. 39 లక్షలకు పైగా ఉంది. వీరితో పాటు బిల్ కలెక్టర్​రాజ్​ కుమార్ 71 డీడీలకు సంబంధించి రూ. 22 లక్షలకు పైగా విలువైన  డీడీలను ప్రాపర్టీ ట్యాక్స్​విభాగంలో జమ చేసినట్లు వెల్లడైంది. మరో బిల్ కలెక్టర్ నరేష్ 7 డీడీలకు సంబంధించి  సుమారు రూ. 3 లక్షలకు జమ చేసినట్లు గుర్తించారు.  కూకట్ సర్కిల్​ బిల్ కలెక్టర్ కిరణ్ కుమార్ మూసాపేట్​సర్కిల్​లోని 24 డీడీలకు సంబంధించి దాదాపు రూ. 10 లక్షలకు   డిపాజిట్ చేసినట్లు తేలింది. వీరిపై కమిషనర్ సస్పెన్షన్ వేటు వేశారు. క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. 
అన్ని సర్కిల్స్​పై ఫోకస్ 
మూసాపేట్​ సర్కిల్​లో ప్రాథమిక విచారణలోనే లక్షలాది రూపాయల గోల్ మాల్​ జరిగినట్లు  గుర్తించగా, మిగతా సర్కిళ్లలోనూ ఇలానే జరిగి ఉండొచ్చనే అనుమానాలున్నాయి. మూసా పేట​లో విచారణ మాదిరిగా అన్ని చోట్లా చేస్తే మరికొందరు అక్రమార్కులు దొరికే అవకాశముందని బల్దియా  ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీనిపై ఫోకస్​ పెట్టనున్నట్టు సమాచారం.