కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యం..

కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యం..

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో డెడ్ బాడీ కలకలం రేపింది.  బ్రాహ్మణ పల్లీ ఔటర్ రింగురోడ్డు సమీపంలో కుళ్లిన స్థితిలో మృత దేహం కనిపించింది. గుర్తుతెలియని వ్యక్తులు గోనే సంచిలో మృతదేహాన్ని మూటకట్టి ఓఅర్అర్ పై నుండి కింద పడేశారు. మూట నుండి దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాళ్ళు చేతులు కట్టేసి సంచిలో ఉన్న మృత దేహాన్ని గుర్తించారు. మృతుడు పురుషుడని ప్రాథమికంగా అంచనా వేశారు. 40 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నట్లుగా గుర్తించారు.  క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు చేరుకొని ఆధారాల కోసం వేట సాగిస్తున్నారు.