సౌదీ నుంచి సొంతూరికి చేరిన డెడ్ బాడీ.. అంత్యక్రియలు పూర్తి చేసిన కుటుంబ సభ్యులు

సౌదీ నుంచి సొంతూరికి చేరిన డెడ్ బాడీ.. అంత్యక్రియలు పూర్తి చేసిన కుటుంబ సభ్యులు

రాయికల్, వెలుగు: సౌదీలో జరిగిన యాక్సిడెంట్ చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీ బుధవారం జగిత్యాల జిల్లా రాయికల్​ టౌన్ కు చేరగా కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఉపాధి కోసం సౌదీకి వెళ్లిన సుతారి ధర్మయ్య(48) ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.

పేద కుటుంబం కావడంతో ధర్మయ్య డెడ్ బాడీని సొంతూరుకు తీసుకొచ్చేందుకు సాటా రియాద్​శాఖ కృషి చేసింది. ఉదయం సొంతూరకు చేరిన డెడ్ బాడీ వద్ద కుటుంబసభ్యులు, బంధువులు బోరున విలపించారు. అనంతరం అంత్యక్రియలు పూర్తిచేశారు. మృతుడు ధర్మయ్యకు భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.