బతికుండగానే డెత్ సర్టిఫికెట్ తెచ్చి రైతుబీమా కొట్టేశారు

బతికుండగానే డెత్ సర్టిఫికెట్ తెచ్చి రైతుబీమా కొట్టేశారు

వికారాబాద్ జిల్లాలో ఏకంగా ప్రభుత్వాన్నే మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కుల్కచర్ల మండలం పుట్టపహడ్‌కు చెందిన బాలయ్య వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఆయన తల్లి చంద్రమ్మ (58) పేరిట కొంత భూమి ఉంది. అయితే గ్రామ రైతుబంధు కో ఆర్డినేటర్ రాఘవేందర్ రెడ్డి అక్రమంగా డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. అందులో భాగంగా చంద్రమ్మ పేరు మీద డెత్ సర్టిఫికెట్ సృష్టించాడు. బాలయ్యకు మాయమాటలు చెప్పి.. చంద్రమ్మ పేరు మీద వచ్చే రైతుభీమా డబ్బులు ఐదు లక్షల రూపాయలను కాజేశాడు. కాగా.. ఈ మధ్య రైతుల ఖాతాల్లో జమ అయిన రైతుబంధు డబ్బులు.. చంద్రమ్మ ఖాతాలో పడకపోవడంతో బాలయ్య వ్యవసాయ అధికారులను ఆశ్రయించాడు. అందుకు అధికారులు.. మీ అమ్మ చనిపోయిందని.. ఆమెకు రావాల్సిన రైతుభీమా కూడా అకౌంట్లో పడిందని తెలిపారు. దాంతో బాలయ్య అయోమయంలో పడ్డాడు. తన తల్లి బతికే ఉందని.. తమకు ఎటువంటి డబ్బులు రాలేదని బాలయ్య వాపోయాడు. అధికారులు స్పందించి.. తనకు న్యాయంచేయాలని బాలయ్య, చంద్రమ్మలు కోరుతున్నారు.