
బ్యాంకాక్: ఇండియా బాక్సర్లు కిరణ్, దీపక్ థాయ్లాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్లో ఫైనల్కు దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన విమెన్స్ 80+ కేజీ సెమీఫైనల్ బౌట్లో కిరణ్ పవర్ఫుల్ పంచ్లు విసిరి 5-–0 తేడాతో ఉక్రెయిన్కు చెందిన పోలినా చెర్నెంకోను చిత్తు చేసింది.
మెన్స్ 75 కేజీ సెమీస్లో దీపక్ 5–-0తో థాయ్లాండ్ బాక్సర్ పీరాపట్ యీసుంగ్నోన్పై ఏకపక్ష విజయం సాధించాడు. లోకల్ ఫేవరెట్ అయిన పీరాపట్పై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. మూడు రౌండ్లలోనూ ప్రత్యర్థిపై పదునైన పంచ్లతో ఈజీగా గెలిచాడు. కాగా, విమెన్స్ సెమీ ఫైనల్స్లో ప్రియ (57 కేజీ), సనేహ్ (70 కేజీ) తమ బౌట్లలో పోరాడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.