ఇంగ్లండ్‌తో టీ20లకూ దీపక్​ దూరం

ఇంగ్లండ్‌తో టీ20లకూ దీపక్​ దూరం

బెంగళూరు: ఇండియా టీ20 స్పెషలిస్ట్‌ దీపక్‌ చహర్‌ గాయం నుంచి కోలుకునేందుకు మరో నాలుగు నుంచి ఐదు వారాల సమయం పట్టనుంది. దాంతో, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు దూరం అవుతున్నాడు. జులై చివర్లో జరిగే వెస్టిండీస్‌ టూర్‌లోనే తను రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.  తొడ కండరాల గాయంతో ఐపీఎల్‌కు దూరమైన చహర్‌తో పాటు చేతి గాయం నుంచి కోలుకుంటున్న స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు. అయితే, సుందర్‌ తొందర్లోనే ఇంగ్లండ్ వెళ్లి లాంకషైర్‌ తరఫున కౌంటీ క్రికెట్‌ ఆడుతాడని బోర్డు వర్గాలు తెలిపాయి.