బాలీవుడ్ జంట దీపికా పదుకొనె, రణవీర్ సింగ్ పెళ్లి రోజును తిరుమల వెంకన్న సన్నిధిలో జరుపుకున్నారు. బుధవారం తిరుమలకు చేరుకున్న వీరు రాత్రి ఇక్కడే బస చేశారు. గురువారం ఉదయం కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ పండితులు వేదాశీర్వచనంతో ఆశీస్సులు అందజేయగా, అధికారులు పట్టువస్త్రం, తీర్థప్రసాదాలు బహూకరించారు. పలు సినిమాల్లో జంటగా నటించిన దీపికా, రణవీర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత ఏడాది ఇటలీలోని లేక్ కోమోలో కొంకణి, సింధి సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరిగింది. ‑ ‑ తిరుమల, వెలుగు