యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మహానటి ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ల ప్రాజెక్ట్ కే చిత్రం షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది. ఇటీవల అమితాబ్ బచ్చన్ రామోజీ ఫిల్మ్సిటీలో జరుగుతున్న షూటింగ్లో గాయపడి ముంబైకు పయనం అయ్యారు. తాజాగా ప్రాజెక్టు కే సినిమా నుంచి లేటెస్ట్ న్యూస్ వచ్చింది.
ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న దీపికా పదుకొనె రూ.10 కోట్లు, బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ అంతకు రెట్టింపు, ప్రభాస్ విషయానికి వస్తే వందకోట్లకు పైనే రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిస్తోంది. ఇక సినిమా బడ్జెట్ ఏ సాయిలో ఉంటుందో అనేది సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు అశ్వినీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.