హైదరాబాద్: ఫ్రాన్స్లోని విచిలో జరుగుతున్న వర్టస్ గ్లోబల్ గేమ్స్లో.. తెలంగాణ యువ అథ్లెట్ జీవాంజి దీప్తి మరోసారి మెరిసింది. శుక్రవారం జరిగిన 200 మీటర్ల రేస్ను దీప్తి 25.27 సెకన్లలో ముగించి సిల్వర్ మెడల్ను గెలుచుకుంది.
యులియా షులియార్ (ఉక్రెయిన్) 25.17 సెకన్లతో గోల్డ్ నెగ్గగా, ఫెలిక్స్ బార్బోసా (బ్రెజిల్) 26.43 సెకన్లతో బ్రాంజ్ మెడల్ను సాధించింది.