ఎర్రకోటలో రావణ దహనం చేసిన కంగనా రనౌత్

ఎర్రకోటలో రావణ దహనం చేసిన కంగనా రనౌత్

ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన దసరా వేడుకల్లో రాష్ట్రపతి ముర్ము పాల్గొన్నారు.  దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో కూడా రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎర్రకోటలో జరిగిన రావణ దహన కార్యక్రమం  బాలీవుడ్ సెలబ్రెటీ కంగానా రనౌత్ చేతుల మీదుగా రావణ దహనం జరిగింది. అయితే మన దేశ చరిత్రలోనే తొలిసారి ఓ మహిళ ఈ రావణ దహనం చేసింది.  దేశవ్యాప్తంగా రావణుడి ఆకారంలో బొమ్మలను ఏర్పాటు చేసి కాల్చుతూ ఉంటారు. 

 ఢిల్లీలోని ఎర్రకోటలో ధార్మిక లీలా కమిటీ ఏర్పాటు చేసిన దసరా ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి ప్రసంగించారు. నేడు మనం అవినీతి నుంచి ఉగ్రవాదం వరకు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఆ సవాళ్లను అధిగమించడానికి శ్రీరాముడి సిద్ధాంతాలు మనకు ఉపయోగపడతాయి. రాముడు రావణుడిని ఓడించినట్లే మనం ఆధునిక రావణుడిని కూడా ఓడించాలని ముర్ము పిలుపునిచ్చారు..