ఢిల్లీ స్కూల్స్: శీతాకాల సెలవులు పొడిగింపు

ఢిల్లీ స్కూల్స్: శీతాకాల సెలవులు పొడిగింపు

దేశ రాజధాని ఢిల్లీలో చలి తీవ్రత మరింత పెరుగుతోంది.  ఈక్రమంలో ఇప్పటికే శీతాకాలం సెలవులను పొడిగించారు. అయితే మరోసారి స్కూళ్లకు శీతాకాలం సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఢిల్లీ విద్యాశాఖ.

పాఠశాలల పునఃప్రారంభంపై ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాలలు అంటే 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్ధులకు మరో వారం పాటు సెలవులు పొడిగించామని తెలిపింది. 6వ తరగతి నుంచి ఆ పై తరగతుల విద్యార్థులకోసం తిరిగి స్కూళ్లు తెరవబడతాయని చెప్పింది.

అయితే ఉదయం 8 గంటల కంటే ముందు, సాయంత్రి 5 గంటల తర్వాత స్కూళ్లు నడపకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.