జనవరి 10 వరకు అన్ని పాఠశాలల్లో శీతాకాల సెలవులను పొడిగిస్తూ సర్క్యులర్ జారీ చేసిన ఢిల్లీ ప్రభుత్వం.. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరిచకుంది. ఈ సర్క్యులర్ 'తప్పుగా జారీ చేయబడింది' అని పేర్కొంటూ ఓ ప్రకటన చేసింది. శీతాకాల విరామాన్ని పొడిగించాలా వద్దా అనే దానిపై ఢిల్లీ విద్యా డైరెక్టరేట్ ఈ రోజు ఉదయం నిర్ణయం తీసుకోనుంది. అంతకుముందు ప్రకటన ప్రకారం, జనవరి 6న సెలవులు ముగియగా, జనవరి 8 నుంచి తరగతులు పునఃప్రారంభం కానున్నాయి.
నగరంలో తీవ్రమైన చలి, పొగమంచు, వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ కారణంగా ఢిల్లీ ప్రభుత్వం తన మునుపటి ఆర్డర్లో, జాతీయ రాజధాని భూభాగం (NCT)లోని అన్ని ప్రభుత్వ-ఎయిడెడ్, అన్ఎయిడెడ్ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో జనవరి 10 వరకు శీతాకాలపు సెలవులను పొడిగించింది. రాబోయే రోజుల్లో దట్టమైన పొగమంచుతో పాటు తేలికపాటి వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఎలో అలెర్ట్ ను జారీ చేసింది.
In light of extreme cold waves and IMD’s yellow alert, Delhi Govt’s Directorate of Education orders to extend the Winter Vacation in all the Govt, Govt-aided and Unaided Recognised Private Schools of Delhi till 10th January pic.twitter.com/p694hT8kEc
— ANI (@ANI) January 6, 2024