జిమ్ముకెళ్తున్నారా.. ట్రెడ్​మిల్​తో జాగ్రత్త.. ఢిల్లీలో ఏమైందంటే..

జిమ్ముకెళ్తున్నారా.. ట్రెడ్​మిల్​తో జాగ్రత్త.. ఢిల్లీలో ఏమైందంటే..

యూత్​ సిక్స్ ప్యాక్​ అని డిఫరెంట్.. బాడీ లుక్కుల కోసం అట్రాక్టివ్​గా, ఫిట్​గా కనిపించేందుకు తహతహలాడుతుంటారు. అందుకోసం జిమ్ముల్లో కఠోర శ్రమ చేస్తుంటారు.  అయితే  జిమ్ముకెళ్లిన ఓ వ్యక్తి కరెంట్​షాక్​తో మృతి చెందాడు. అది జిమ్​ బిల్డింగ్ కి వచ్చిన షాక్​ కాదు. ట్రెడ్​ మిల్లుపై కూర్చున్నప్పుడు జరిగిన సంఘటన.  

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణికి చెందిన సాక్షం పృథి(24)  గురుగ్రామ్​లోని ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్​చేస్తున్నాడు. తాను నివసిస్తున్న ప్రాంతంలోని అతను రోజు ఓ జిమ్​కు వెళ్తుంటాడు.  జులై 18న జిమ్​లో వ్యాయామం చేస్తూ అక్కడి ట్రెడ్​మిల్​పై కూర్చున్నాడు. అకస్మాత్తుగా కరెంటు షాక్​ అతని బాడీలో ప్రసరించడంతో విలవిల్లాడాడు. గమనించిన తోటి వారు  హాస్పిటల్​కి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 

ట్రెడ్​మిల్ కు కరెంట్ సరఫరా అయినందుకే ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. జిమ్​ మెంటేనన్స్​లో నిర్లక్ష్యం వహించిన జిమ్​ ఓనర్​ అనుభవ్​దుగ్గాను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.