యూత్ సిక్స్ ప్యాక్ అని డిఫరెంట్.. బాడీ లుక్కుల కోసం అట్రాక్టివ్గా, ఫిట్గా కనిపించేందుకు తహతహలాడుతుంటారు. అందుకోసం జిమ్ముల్లో కఠోర శ్రమ చేస్తుంటారు. అయితే జిమ్ముకెళ్లిన ఓ వ్యక్తి కరెంట్షాక్తో మృతి చెందాడు. అది జిమ్ బిల్డింగ్ కి వచ్చిన షాక్ కాదు. ట్రెడ్ మిల్లుపై కూర్చున్నప్పుడు జరిగిన సంఘటన.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణికి చెందిన సాక్షం పృథి(24) గురుగ్రామ్లోని ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్చేస్తున్నాడు. తాను నివసిస్తున్న ప్రాంతంలోని అతను రోజు ఓ జిమ్కు వెళ్తుంటాడు. జులై 18న జిమ్లో వ్యాయామం చేస్తూ అక్కడి ట్రెడ్మిల్పై కూర్చున్నాడు. అకస్మాత్తుగా కరెంటు షాక్ అతని బాడీలో ప్రసరించడంతో విలవిల్లాడాడు. గమనించిన తోటి వారు హాస్పిటల్కి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
ట్రెడ్మిల్ కు కరెంట్ సరఫరా అయినందుకే ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. జిమ్ మెంటేనన్స్లో నిర్లక్ష్యం వహించిన జిమ్ ఓనర్ అనుభవ్దుగ్గాను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.