ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాగుంట రాఘవకు బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాగుంట రాఘవకు బెయిల్

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు కుమారుడు మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాల దృష్ట్యా తనకు బెయిల్ ఇవ్వాలని రాఘవ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై గతంలో విచారణ జరిపిన జస్టిస్ దినేశ్ కుమార్ శర్మ బెంచ్ మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అలాగే రాఘవ పిటిషన్ పై ఈడీ సమాధానం కోరింది. 


శుక్రవారం మరోసారి ఈ పిటిషన్ ను హైకోర్టు బెంచ్ విచారించింది. ఈ సంద ర్భంగా రాఘవ దర్యాప్తునకు సహకరి స్తున్నందున అతనికి బెయిల్ మంజూరు చేయవచ్చని ఈడీ ఇచ్చిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు రూ. 2 లక్షల పూచీకత్తుతో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. పాస్ పోర్ట్ అప్పగించాలని, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని, తదుపరి విచారణకు సహకరించాలని షరతులు విధించింది.