లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత
ఇప్పటికే ఆమె సన్నిహితుల అరెస్ట్
త్వరలో ఎలాంటి పరిణామాలైనా జరగొచ్చంటున్న గులాబీ లీడర్లు
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్స్కామ్లో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్సిసోడియా అరెస్ట్ కావడం బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో దడ పుట్టిస్తున్నది. కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచడంతో నెక్స్ట్ఏం జరుగుతుందా అని ఆందోళన చెందుతున్నారు. స్కామ్కు కేంద్ర బిందువుగా చెప్తున్న సౌత్లాబీని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కొడుకు మాగుంట రాఘవ నడిపించారని మొదటి నుంచి ప్రచారం జరుగుతున్నది. ఈ స్కామ్లో ఇప్పటివరకు 12 మందిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్చేయగా.. ఇందులో కవిత సన్నిహితులైన బోయినపల్లి అభిషేక్, అరుణ్ రామచంద్ర పిళ్లై, శరత్చంద్రారెడ్డి ఉన్నారు. కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును కూడా సీబీఐ అరెస్టు చేసింది. సిసోడియా అరెస్ట్ తర్వాత ఇంకెవరు అరెస్ట్ అవుతారనే దానిపై ప్రగతి భవన్ వర్గాల్లో, బీఆర్ఎస్ పార్టీలో రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి. గతంలో ఎమ్మెల్సీ కవితను ఈ స్కామ్లో సాక్షిగా సీబీఐ విచారించింది. కేసులో నిందితులుగా పేర్కొంటున్న వారి రిమాండ్రిపోర్టులు, దాఖలు చేసిన చార్జ్షీట్లలో కవిత పేరు ప్రస్తావించారు. స్కామ్ టైమ్లో కవిత పలు ఐఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ తన చార్జ్షీట్లో వెల్లడించింది. ఆప్నేత విజయ్ నాయర్ ద్వారానే సౌత్లాబీ సిసోడియాకు వంద కోట్ల ముడుపులు చెల్లించిందన్న ఆరోపణలున్నాయి.
కీలక రాజకీయ నేత అరెస్ట్తో..
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మొదట వ్యాపారవేత్తలు, ఆడిటర్లను అరెస్టు చేశారు. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయడం, ఆయన కీలక నేత కావడంతో ఇక ముందు అరెస్టులన్నీ రాజకీయ నేతలవే ఉండొచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ స్కామ్లో మరికొన్ని రోజుల్లో ఎలాంటి పరిణామాలైనా చోటు చేసుకోవచ్చని, ఇందుకు మానసికంగా సిద్ధం కావాల్సిందేనని బీఆర్ఎస్ నేత ఒకరు కామెంట్ చేశారు. కవిత విషయంలో సీబీఐ తదుపరి చర్యలకు ఉపక్రమించకుండా ఉండేందుకు కేసీఆర్ ఎలాంటి ఎత్తుగడలు వేయబోతున్నారనేదానిపైనా బీఆర్ఎస్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.