ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో మంటలు.. సికింద్రాబాద్ ఏఓసీ రోడ్డులో ఘటన

ఢిల్లీ పబ్లిక్  స్కూల్ బస్సులో మంటలు.. సికింద్రాబాద్ ఏఓసీ రోడ్డులో ఘటన

పద్మారావునగర్, వెలుగు: స్టూడెంట్స్​లో వెళ్తున్న స్కూల్​ బస్సులో ఒక్కసారిగా మంటలు లేచాయి. ఈ ఘటన కంటోన్మెంట్ లో జరిగింది. గురువారం ఉదయం ఢిల్లీ పబ్లిక్​ స్కూల్​ బస్సు స్టూడెంట్స్​తో ఏవోసీ రోడ్డులో వెళ్తోంది. ఈ క్రమంలో బస్సు ఇంజిన్​ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్​ వెంటనే బస్సును ఆపేశాడు. అక్కడే ఉన్న  ఆర్మీ సిబ్బంది పిల్లలను బస్సులో నుంచి దింపేశారు. ఫైర్ ఇంజిన్ సకాలంలో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేసింది. ఈ ప్రమాదంతో కాసేపు రాకపోకలు నిలిచిపోయాయి.