
- మరో రెండు రోజులు ఇదే పరిస్థితి
ఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు మంచి నమోదవుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్అలర్ట్ జారీ చేసింది. మరో రెండు రోజుల పాటు ఇదే విధమైన వేడి వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు.
రాజధాని నగరంలోని చాలా ప్రాంతాల్లో 44 నుంచి 46 డిగ్రీల మధ్య టెంపరేచర్ నమోదవుతుంది. ఫలితంగా ఢిల్లీలో వేడిగాలులు వీస్తున్నాయి. సఫ్దర్జంగ్లో 43.8 డిగ్రీలు నమోదు కాగా, అత్యధికంగా ఆయనగర్లో 45.5 డిగ్రీలు నమోదైనట్లు, ఇది సాధారణం కంటే ఎక్కువని వాతావరణ శాఖ తెలిపింది.
ALSO READ | తైవాన్లో 5.9 తీవ్రతతో భారీ భూకంపం.. దేశవ్యాప్తంగా కంపించిన భూమి