ఢిల్లీలో రెడ్ అలర్ట్..45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

ఢిల్లీలో రెడ్ అలర్ట్..45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
  • మరో రెండు రోజులు ఇదే పరిస్థితి

ఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు మంచి నమోదవుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్​అలర్ట్​ జారీ చేసింది. మరో రెండు రోజుల పాటు ఇదే విధమైన వేడి వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. 

రాజధాని నగరంలోని చాలా ప్రాంతాల్లో 44 నుంచి 46 డిగ్రీల మధ్య టెంపరేచర్​ నమోదవుతుంది. ఫలితంగా ఢిల్లీలో వేడిగాలులు వీస్తున్నాయి. సఫ్దర్​జంగ్​లో 43.8 డిగ్రీలు నమోదు కాగా, అత్యధికంగా ఆయనగర్​లో 45.5 డిగ్రీలు నమోదైనట్లు, ఇది సాధారణం కంటే ఎక్కువని వాతావరణ శాఖ తెలిపింది.

ALSO READ | తైవాన్‌లో 5.9 తీవ్రతతో భారీ భూకంపం.. దేశవ్యాప్తంగా కంపించిన భూమి