తైవాన్‌లో 5.9 తీవ్రతతో భారీ భూకంపం.. దేశవ్యాప్తంగా కంపించిన భూమి

తైవాన్‌లో 5.9 తీవ్రతతో భారీ భూకంపం.. దేశవ్యాప్తంగా కంపించిన భూమి

తైపీ: తైవాన్‎లో భారీ భూ కంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‎పై 5.9గా నమోదైంది. బుధవారం (జూన్ 11) సాయంత్రం హువాలియన్ నగరానికి దక్షిణంగా 71 కిలోమీటర్లు (44.1 మైళ్ళు) దూరంలో భూమికి10 కిలోమీటర్ల (6.21 మైళ్ళు) లోతులో భూప్రకంపనలు వచ్చినట్లు యూఎస్‎జీఎస్ వెల్లడించింది. భూకంపం కేంద్రం 29 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది. భూకంపం కేంద్రం భూ ఉపరితలానికి దగ్గరగా ఉండటంతో  దేశవ్యాప్తంగా భూమి కంపించింది. 

ALSO READ | ఉగ్రవాదుల కంటే దారుణంగా ప్రవర్తించారు: USలో భారతీయ విద్యార్థి బహిష్కరణపై ప్రత్యక్ష సాక్షి

 

రాజధాని తైపీలో పెద్ద పెద్ద భవనాలు దాదాపు నిమిషం పాటు ఊగిపోయాయి. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్ధంకాక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం నేపథ్యంలో తైవాన్ ప్రభుత్వం ప్రభుత్వం అప్రమత్తమైంది. భూ కంప ప్రభావిత ప్రాంతాల్లో సహకయ చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేసింది.  ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన లెక్కలపై తైపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయలేదు.