ఉగ్రవాదుల కంటే దారుణంగా ప్రవర్తించారు: USలో భారతీయ విద్యార్థి బహిష్కరణపై ప్రత్యక్ష సాక్షి

ఉగ్రవాదుల కంటే దారుణంగా ప్రవర్తించారు: USలో భారతీయ విద్యార్థి బహిష్కరణపై ప్రత్యక్ష సాక్షి

అమెరికాలో భారతీయ విద్యార్థిపై అక్కడి అధికారులు దారుణంగా ప్రవర్తించిన తీరు పెద్ద దుమారం రేపింది.ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన విద్యార్థిని  ఓఖైదీలా, ఉగ్రవాదిలా చేతికి సంకెళ్లు వేసి దారుణంగా హింసించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారతీయులు మండిపడ్డారు.  విద్యార్థిని ఎయిర్ పోర్టులో పట్టుకొని నేలపై పడేసి చేతులు వెనక్కి విరిచి బేడీలు వేస్తుండగా ప్రత్యక్ష సాక్షి తన కెమెరాల బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విద్యార్థుల పట్ల అమెరికా అధికారులు ఉగ్రవాదులకంటే దారుణంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేస్తే పోస్ట్ చేశారు.  

ALSO READ | అమెరికాలో ఏంటీ దుస్థితి..భారతీయ విద్యార్థులను భయపెడుతున్న ట్రంప్

జూన్ 7న న్యూయార్క్ ఎయిర్ పోర్టులో భారతీయ విద్యార్థికి జరిగిన అవమానాన్ని   కునాల్ జైన్ అనే NRI తన కెమెరాలో షూట్ చేసి  సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అమెరికా లో విద్యార్థులపట్ల అధికారులు ప్రవర్తించిన రాక్షసత్వం విషయం వెలుగులోకి వచ్చింది. సామాజిక వ్యవస్థాపకుడు, రచయిత అయిన కునాల్ జైన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఈ విషయాలను వెల్లడించారు.  

భారతీయ విద్యార్థిని ఓ ఉగ్రవాదిలా ట్రీట్ చేశారని ఆ దృశ్యాన్ని చూసిన షాక్ అయ్యానన్నారు జైన్. యూనైటెడ్ స్టేట్స్ లో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వం అంటూ విద్యార్థుల పట్ల ఆ విధంగా ప్రవర్తించడం దారుణం అన్నారు కునాల్ జైన్.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో హర్యానా యాసలో మాట్లాడుతూ కనిపిస్తున్ ఆ విద్యార్థి తాను మానసికంగా స్థిమితంగా ఉన్నానని పదే పదే చెప్పాడని అన్నారు జైన్. ఎవరినీ అతనితో హిందీలో మాట్లాడనివ్వకపోవడం..అతనికి న్యాయవాదిని పెట్టుకునేందుకు నిరాకరించడం - బాధాకరం" అన్నారు  జైన్.

ఈ ఘటనపై న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. న్యూయార్క్ ఎయిర్ పోర్టులో భారతీయ విద్యార్థి ఎదుర్కొన్న ఇబ్బందులు చూశాం.. స్థానిక అధికారులతో మాట్లాడుతున్నాం. కాన్సులేట్ ఎప్పుడూ భారతీయ పౌరుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని’’ చెబుతున్నారు కాన్సులేట్ అధికారులు. 

ఈ వివాదంపై స్పందించిన భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం.. చట్టబద్దమైన ప్రయాణాన్ని మాత్రమే అమెరికాలోకి అనుమతిస్తామన్న మాటనే వినిపిస్తోంది. అమెరికా చట్టబద్దమైన ప్రయాణికులను మాత్రమే దేశంలోకి అనుమతిస్తుందని అంటోంది. వీసాల దుర్వినియోగం, అమెరికా చట్టాల ఉల్లంఘనను సహించమని తన వైఖరిని ఖరాఖండిగా చెప్పేసింది. 

వివిధ దేశాలకు చెందిన విద్యార్థులపై నిఘా పెట్టి ముందస్తు నోటీసులు లేకుండా వీసాల రద్దు,  నిర్బంధించడం వంటి వలస వ్యతిరేక చర్యలను అమెరికా ప్రభుత్వం చేపట్టిన క్రమంలో ధృవీకరణ పత్రాలు లేని భారతీయ వలసదారులను దేశం బహిష్కరణ చేస్తున్న అత్యంత ఆందోళనకరమై ఘటనల్లో ఇదొకటి. 2024లో దాదాపు 15వందల మంది భారతీయ పౌరులను అమెరికా నుంచి బహిష్కరించారు.