అమెరికాలో ఏంటీ దుస్థితి..భారతీయ విద్యార్థులను భయపెడుతున్న ట్రంప్

అమెరికాలో ఏంటీ దుస్థితి..భారతీయ విద్యార్థులను భయపెడుతున్న ట్రంప్

అమెరికాలో భారతీయ విద్యార్థుల పరిస్థితి మరీ దారుణం..ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన వారికి అవమానం ఎదురవుతోంది. వీసా నిబంధనలంటూ విద్యార్థుల చేతికి సంకెళ్లు వేస్తున్నారు. నేరస్థుల్లా ట్రీట్ చేస్తున్నారు. అమెరికాలోని న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో భారతీయ విద్యార్థి పట్ల అక్కడి అధికారులు అమానుషంగా ప్రవర్తించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ విద్యార్థిని నేలపై పడుకోబెట్టి, చేతులకు సంకెళ్లు వేసి అరెస్ట్ చేసి, ఆ తర్వాత దేశం నుంచి బహిష్కరించారు. ఈ ఘటన తర్వాత భారత్ లోని యూఎస్ ఎంబసీ ప్రకటన విద్యార్థుల్లో మరింత భయాందోళన పెంచుతోంది. ఈ ఘటనతో అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీసా నిబంధనలు, ప్రయాణికులతో వ్యవహరించే తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. 

ఈ ఘటనపై స్పందించిన భారత్ లోని యూఎస్ ఎంబసీ ..తమ దేశానికి చట్టబద్ధంగా వచ్చే ప్రయాణికులను ఎల్లప్పుడూ స్వాగతిస్తుందని చెబుతూనే అమెరికా చట్టాలను ఉల్లంఘించడం, వీసాలను దుర్వినియోగం, అక్రమంగా చొరబడితే ఇదిగో ఇలా ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. అమెరికా సందర్శించడానికి ఎవరికీ హక్కు లేదు అని కూడా యూఎస్ ఎంబసీ తీవ్రంగా హెచ్చరింది. 

భారతీయ విద్యార్థుల పట్ల అమెరికా తీరును సోషల్ మీడియాలో తీవ్ర ఆందోళన వ్యక్తం అయింది. కునాల్ జైన్ అనే సామాజిక కార్యకర్త ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతోంది. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని.. భారతీయ విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని జైన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఘటనను చూసినప్పుడు చాలా బాధ కలిగిందని విద్యార్థి తన కలల కోసం అమెరికాకు వచ్చాడు.. అతడిని నేరస్థుడిలా ట్రీట్ చేశారని ఆవేదన కలిగించదన్నారు. అమెరికా తీరుపట్ల నెటిజన్లు మండిపడుతున్నారు.  

న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో భారతీయ విద్యార్థిపట్ల అధికారులు ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో భారతీయ సమాజం నుంచి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన భారతీయ విద్యార్థుల భద్రత, గౌరవంపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది.