కరోనా పేషెంట్​కు ఇంట్లోనే డెలివరీ

కరోనా పేషెంట్​కు ఇంట్లోనే డెలివరీ

చొరవ చూపిన 108 సిబ్బంది

వేములవాడ, వెలుగు: కరోనా పాజిటివ్ పేషెంట్​కు 108 అంబులెన్స్ సిబ్బంది ఇంట్లోనే డెలివరీ చేశారు. రాజన్న సిరిసిల్ల  జిల్లా వేములవాడ అర్బన్ కాలనీకి చెందిన గర్భిణీకి డెలివరీ టైం దగ్గరికి వచ్చేసరికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో డాక్టర్లు హైదరాబాద్ తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్​కు ఫోన్ చేశారు. వెంటనే  అక్కడికి 108 చేరుకుంది. గర్భిణికి అప్పటికే నొప్పులు ఎక్కువయ్యాయి. మెడికల్ టెక్నీషియన్  స్వాతి ఎలాంటి ఆందోళన చెందకుండా ఇంట్లోనే డెలివరీ చేశారు. తల్లీ, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. అనంతరం వారిని 108 సిబ్బంది ట్రీట్​మెంట్ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

For More News..

రూ. 4 వేల కోట్లతో సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో.. 9 కిలోమీటర్ల పొడవైన టన్నెల్

అధిక వడ్డీలు ఆఫర్ చేస్తున్న చిన్న బ్యాంకులు

ట్రంప్‌‌కు కరోనాతో స్టాక్ మార్కెట్లన్నీ అతలాకుతలం